కోనేరు ప్రసాద్ రాజీనామా తో షాక్ తిన్న 'వైసీపీ'
- March 16, 2016
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు ప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయవాడలో పోటీ చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని, తమ రాజీనామాను ఆమోదించాల్సింగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఆ లేఖను బుధవారం ఆయన విడుదల చేశారు. ఇటీవలి కాలంలో వైసీపీలో జరుగుతున్న పరిణామాలు, దీంతోపాటు ఉత్తరాంధ్రలో కోనేరు ప్రసాద్కు బీచ్ సాండ్ ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టుపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో విశాఖకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దానిపై శాసనసభలో ప్రశ్నోత్తర సమయంలో లేవనెత్తారు. దీనిపై వెంటనే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కోనేరు రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







