ఏపీలో కరోనా కేసుల వివరాలు
- September 20, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,679 శాంపిల్స్ పరీక్షించగా.. 839 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.. ఇక, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున.. మొత్తం 8 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు. ఇదే సమయంలో 1,142 మంది పూర్థిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.
తాజా టెస్ట్లతో కలుపుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్ల సంఖ్య 2,77,63,761కు చేరింది. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,39,529కి పెరగగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 20,11,063కు చేరుకుంది.. మరోవైపు.. ఇప్పటి వరకు 14,078 మంది కోవిడ్ బాధితులు రాష్ట్రంలో మృతిచెందగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 14,388గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!