నేడు రామానాయుడు 79వ జయంతి
- June 05, 2015
తెలుగువారి ఘనకీర్తిని దశదిశలా వెలిగేలా చేసిన అరుదైన వ్యక్తుల సరసన డి.రామానాయుడు స్థానం పదిలం... ఓ తెలుగు నిర్మాత హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించి, శతాధిక చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ లోనూ చోటు సంపాదించారు రామానాయుడు... 'సురేశ్ ప్రొడక్షన్స్' పతాకంపై ఆయన నిర్మించిన ఎన్నో చిత్రాలు తెలుగునేలను పులకింపచేశాయి... యన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన 'రాముడు-భీముడు' చిత్రంతోనే నిర్మాతగా రామానాయుడు జైత్రయాత్ర మొదలయింది... రామానాయుడు జైత్రయాత్రకు 'రాముడు-భీముడు' బీజం వేస్తే- ఆయనను విజయసారథిగా నిలిపిన చిత్రం 'ప్రేమనగర్'... ఏయన్నార్-వాణిశ్రీ జంటగా రూపొందిన 'ప్రేమనగర్' నవలా చిత్రాల్లో ఓ మణిపూసగా నిలచింది...యన్టీఆర్, ఏయన్నార్ తో చిత్రాలను నిర్మించి జనాన్ని అలరించిన రామానాయుడు కాంతారావుతోనూ కొన్ని జానపద చిత్రాలను నిర్మించారు... తరువాతి తరం హీరోలయిన శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజుతోనూ ఆయన చిత్రాలను తెరకెక్కించారు... ముఖ్యంగా శోభన్ బాబుకు అరుదైన విజయాలను అందించిన ఘనత రామానాయుడిదే... తెలుగునాట పలు మల్టీస్టారర్స్ తెరకెక్కినా, అందులో స్వర్ణోత్సవ చిత్రంగా నిలచింది- రామానాయుడు నిర్మించిన 'ముందుడుగు' సినిమానే... శోభన్ బాబు, కృష్ణ హీరోలుగా రూపొందిన 'ముందడుగు' హైదరాబాద్ లో స్వర్ణోత్సవం జరుపుకుంది... తరువాతి తరం హీరోలతోనూ రామానాయుడు చిత్రాలను నిర్మించి జనాన్ని అలరించారు... తన ఫైట్స్ తో చిరంజీవి తెలుగువారిని సమ్మోహితులను చేస్తున్నతరుణంలో ఆయనతో రామానాయుడు 'సంఘర్షణ' నిర్మించారు... ఈ సినిమా మాస్ ను విశేషంగా ఆకట్టుకుంది... యన్టీఆర్ తో చిత్రాలు నిర్మిస్తూ జైత్రయాత్ర ఆరంభించిన రామానాయుడు, నటరత్న నటవారసుడు బాలకృష్ణతోనూ రెండు సిల్వర్ జూబ్లీ మూవీస్ తెరకెక్కించడం విశేషం... తండ్రీకొడుకులు ఇద్దరితోనూ సిల్వర్ జూబ్లీ హిట్స్ తీసిన ఘనత రామానాయుడిదే... తెలుగు టాప్ హీరోస్ అందరితోనూ చిత్రాలను నిర్మించి విజయాలను సాధించిన రామానాయుడు తన తనయుడు వెంకటేశ్ ను 'కలియుగపాండవులు' ద్వారా హీరోని చేశారు... వెంకటేశ్ తండ్రి అభిలాషను నెరవేరుస్తూ తనదైన అభినయంతో అలరించారు... పలువురు నటీనటులతో పాటు ఎంతో మంది టెక్నీషిన్స్ కి సినీ జన్మను ప్రసాదించారు రామానాయుడు... కారంచేడులో జిన్మించిన రామానాయుడు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవడం వెనుక ఆయన కృషి, దీక్ష, పట్టుదల ఉన్నాయి...ఎన్నో అవార్డులు, రివార్డులూ నాయుడు కీర్తి కిరీటంలో రత్నాలుగా వెలుగొందుతున్నాయి... అలుపు అన్నది ఎరుగకుండా గెలుపు కోసం శ్రమించిన రామానాయుడు భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచే ఉంటారు...
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







