ఏపీ కరోనా అప్డేట్..
- September 22, 2021
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీ లో నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1365 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,42, 073 కి పెరిగింది.
ఒక్క రోజు వ్యవధిలో మరో 08 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 097 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13, 796 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1466 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,14, 180 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 56, 720 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 78, 70, 218 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









