వేద ఎంటర్ప్రైజస్ వారి కొత్త చిత్రం..!
- March 17, 2016
వేద ఎంటర్ప్రైజస్ ప్రొడక్షన్స్లో ఓ కొత్త చిత్రం నిర్మాణానికి సిద్ధమవుతోంది. శ్రీకర బాబు దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ నూతన చిత్రాన్ని దగ్గుబాటి వరుణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, ధీరేంద్ర, ప్రవీణ్, బిందు బార్బి, కారుణ్య చౌదరి, సాయాజీ షిండే తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో గురువారం ఈ చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 18 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. అమోఘ్ దేశపతి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతున్నారు.

కథనం పూర్తిగా కామెడీ, హారర్గా కొనసాగుతుందని దర్శకుడు శ్రీకర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు డి. సురేశ్బాబు, అశోక్కుమార్, ప్రసన్నకుమార్, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







