రజినీకాంత్ 'రోబో' 2 తాజాగా ఢిల్లీ లో షెడ్యూల్..
- March 17, 2016
తెలుగు, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 'రోబో' ఎంతటి ఘనవిజయం సాధించిందో వేరే చెప్పనవసరం లేదు. రజినీ కెరీర్ లో బిగ్గెస్ హిట్,భారీ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2.0 శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్గా కనిపించనున్నారు. ఇంటర్నేషనల్ మూవీగా హై స్టాండర్డ్స్తో శంకర్ 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కబాలి చిత్రం షూటింగ్ లో ఉన్న రజినీ ఈ చిత్రానికి ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది.మొన్నటి వరకు చెన్నైలోని ఓ భారీ సెట్లో ఈ చిత్ర షూటింగ్ జరగగా, తాజాగా ఢిల్లీ షెడ్యూల్ ని జరుపుకోనున్నట్టు మూవీ టీం ప్రకటించింది. అయితే ఢిల్లీలోని జవహరల్ లాల్ నెహ్రూ స్టేడియంలో 2.0 కోసం వేసిన ఓ ప్రత్యేక సెట్లో ఈ చిత్ర షూటింగ్ నెలరోజుల పాటు జరగనుంది. ఇందులో ఓ యాక్షన్ ఎపిసోడ్ని చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో రజనీతో పాటు అక్షయ్ కుమార్ కూడా పాల్గొననున్నారు. శంకర్- రజినీకాంత్ల హ్యట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిర్మిస్తుంది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









