రజినీకాంత్ 'రోబో' 2 తాజాగా ఢిల్లీ లో షెడ్యూల్..
- March 17, 2016
తెలుగు, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 'రోబో' ఎంతటి ఘనవిజయం సాధించిందో వేరే చెప్పనవసరం లేదు. రజినీ కెరీర్ లో బిగ్గెస్ హిట్,భారీ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2.0 శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్గా కనిపించనున్నారు. ఇంటర్నేషనల్ మూవీగా హై స్టాండర్డ్స్తో శంకర్ 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కబాలి చిత్రం షూటింగ్ లో ఉన్న రజినీ ఈ చిత్రానికి ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది.మొన్నటి వరకు చెన్నైలోని ఓ భారీ సెట్లో ఈ చిత్ర షూటింగ్ జరగగా, తాజాగా ఢిల్లీ షెడ్యూల్ ని జరుపుకోనున్నట్టు మూవీ టీం ప్రకటించింది. అయితే ఢిల్లీలోని జవహరల్ లాల్ నెహ్రూ స్టేడియంలో 2.0 కోసం వేసిన ఓ ప్రత్యేక సెట్లో ఈ చిత్ర షూటింగ్ నెలరోజుల పాటు జరగనుంది. ఇందులో ఓ యాక్షన్ ఎపిసోడ్ని చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో రజనీతో పాటు అక్షయ్ కుమార్ కూడా పాల్గొననున్నారు. శంకర్- రజినీకాంత్ల హ్యట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిర్మిస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







