రజినీకాంత్ 'రోబో' 2 తాజాగా ఢిల్లీ లో షెడ్యూల్‌..

- March 17, 2016 , by Maagulf
రజినీకాంత్  'రోబో' 2 తాజాగా ఢిల్లీ లో షెడ్యూల్‌..

తెలుగు, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 'రోబో' ఎంతటి ఘనవిజయం సాధించిందో వేరే చెప్పనవసరం లేదు. రజినీ కెరీర్ లో బిగ్గెస్ హిట్,భారీ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ 2.0 శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా కనిపించనున్నారు. ఇంటర్నేషనల్‌ మూవీగా హై స్టాండర్డ్స్‌తో శంకర్‌ 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కబాలి చిత్రం షూటింగ్ లో ఉన్న రజినీ ఈ చిత్రానికి ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది.మొన్నటి వరకు చెన్నైలోని ఓ భారీ సెట్‌లో ఈ చిత్ర షూటింగ్‌ జరగగా, తాజాగా ఢిల్లీ షెడ్యూల్‌ ని జరుపుకోనున్నట్టు మూవీ టీం ప్రకటించింది. అయితే ఢిల్లీలోని జవహరల్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో 2.0 కోసం వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో ఈ చిత్ర షూటింగ్‌ నెలరోజుల పాటు జరగనుంది. ఇందులో ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ని చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌లో రజనీతో పాటు అక్షయ్‌ కుమార్‌ కూడా పాల్గొననున్నారు. శంకర్- రజినీకాంత్‌ల హ్యట్రిక్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిర్మిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com