పర్సనల్ డిజిటల్ పేమెంట్స్ ఫీజు 40 శాతం తగ్గించిన కెనెట్ (Knet)

- October 09, 2021 , by Maagulf
పర్సనల్ డిజిటల్ పేమెంట్స్ ఫీజు 40 శాతం తగ్గించిన కెనెట్ (Knet)

కువైట్: డిజిటల్ పేమెంట్స్ ను మరింత ప్రోత్సహించేందుకు ఆటోమేటెడ్ బ్యాకింగ్ సర్వీస్ కంపెనీ "కెనెట్"  (Knet) కీలక నిర్ణయం తీసుకుంది. పర్సనల్ డిజిటల్ చెల్లింపుల ఫీజు ను భారీగా తగ్గించింది. ఇప్పటి వరకు 50 ఫిల్స్ గా ఉన్న ఛార్జ్ ను 30 ఫిల్స్ గా మార్చింది.  బ్యాంక్ లకు డిజిటల్ చెల్లింపుల భారాన్ని తగ్గించేందుకు కూడా ఈ నిర్ణయం మేలు చేస్తుందని కంపెనీ ప్రకటించింది. పేమెంట్ లింక్ అనే మెసేజ్ లను కెనెట్ సంస్థ కస్టమర్లకు పంపిస్తోంది. ఆ మెసేజ్ లో వచ్చే పేమెంట్ లింక్ ను ఓపెన్ చేసి దాని  ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ పేమెంట్స్ పెంచటంలో ఇదో కీలక అడుగని కెనెట్ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com