కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు అనుమతి

- October 11, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు అనుమతి

సౌదీ అరేబియా: సౌదీ ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారికి మాత్రమే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అనుమతించబడుతుందని సౌదీ ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) తెలిపింది.ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సౌదీ ట్రాన్స్‌పోర్ట్ జనరల్ ఈ మేరకు స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలో రోజు 7,50,000 కంటే ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సేవలను ఉపయోగిస్తున్నారు. ఇందులో నగరాల మధ్య రవాణా, స్కూల్ బస్సులు, టాక్సీలు, రైళ్లు, ఫెర్రీలు ఉన్నాయి.

ప్రస్తుతం సౌదీలో ట్రైన్స్, బస్సులు, ఫెర్రీలు 50శాతం సామర్థ్యం తో నడుస్తున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com