పార్కింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని ఆదేశించిన ప్రిన్స్
- October 13, 2021
షార్జా:పబ్లిక్ పార్కింగ్ సేవలను అభివృద్ధి చేయాలని షార్జా యువరాజు, డిప్యూటీ పాలకుడు అండ్ షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) ఛైర్మన్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి అధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో SEC సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. షార్జా ఎమిరేట్లో పబ్లిక్ పార్కింగ్ స్థలాల నిర్వహణ, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ నివేదిక గురించి కౌన్సిల్ చర్చించింది. ఎమిరేట్లోని నగరాలు, ఇతర ప్రాంతాలలో అందుబాటులో ఉన్న పార్కింగ్ ప్లేస్ ల సంఖ్య, వాటికి ఉన్న డిమాండ్, వాటిని నిర్వహించడానికి ఉన్న యంత్రాంగం వంటి వాటిపై అధికారులు సమర్పించిన నివేదికపై కౌన్సిల్ చర్చించింది. షార్జాలో పార్కింగ్ ఫీజులు, పార్కింగ్ స్థలాల వినియోగం, పర్యాటకులను ఆకర్షించేందుచే చేపట్టాల్సిన అభివృద్ధి పనలపై అధికారులును కౌన్సిల్ అడిగి తెలుసుకుంది. షార్జా ఎమిరేట్లో పబ్లిక్ పార్కింగ్ ప్లేస్ సేవలను మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సేవలను అభివృద్ధి చేయాలని కౌన్సిల్ ఆదేశించింది. షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ, ఎమిరేట్స్ టెలికమ్యూనికేషన్స్ గ్రూప్ కంపెనీల మధ్య వ్యూహాత్మక అవగాహన ఒప్పందాన్ని కౌన్సిల్ ఆమోదించింది. రెండు ప్రాంతాల అభివృద్ధిలో ఈ ఒప్పందం దోహదం చేస్తుందని, షార్జాలో చేపట్టే భవిష్యత్తు ప్రాజెక్టులలో ఇది ప్రతిబింబిస్తుందని కౌన్సిల్ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







