ఇన్సర్టబుల్ కార్డియాక్ మానిటర్..
- March 18, 2016
గుండెపోటును ముందుగానే గుర్తించగల పరికరం అందుబాటులోకి వచ్చేసింది. ఇన్సర్టబుల్ కార్డియాక్ మానిటర్, 1.2 సీసీ పరిమాణం కలిగిన ఈ చిన్న పరికరం మూడేళ్లపాటు గుండె స్పందనలను నమోదు చేస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటే దానికి సంబంధించిన సంకేతాలను ముందుగానే అందిస్తుంది. బెంగళూరులోని జయదేవ హృద్రోగ ఆస్పత్రి వైద్యులు దేశంలోనే మొదటిసారిగా 55 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తికి శస్త్రచికిత్స చేసి ఈ పరికరాన్ని అమర్చారు.ఆ విశేషాలను ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఎం.మంజునాథ్, వైద్య నిపుణుడు డాక్టర్ జయప్రకాష్ శంతూర్ శనివారం మీడియాకు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త కాంతిలాల్ తాతేడ్ కొద్ది రోజులుగా అప్పుడప్పుడూ స్పృహ కోల్పోయేవారు. అడపాదడపా ఆయన ఛాతీ నొప్పితో కూడా బాధపడ్డారు. దీనికి సంబంధించి ఆయన పలు చోట్ల వైద్య పరీక్షలు చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. ఈసీజీ, ఎంఆర్ఐ స్కాన చేయించిన తర్వాత డాక్టర్ జయప్రకాష్ శంతర్ను ఆశ్రయించారు. ఆయన కాంతిలాల్ కుటుంబ సభ్యులతో చర్చించి ఈ పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం అందించే సమాచారం ఆధారంగా తదుపరి శస్త్రచికిత్సల కోసం కాంతిలాల్ను సిద్ధం చేస్తామని జయదేవ ఆస్పత్రి హృద్రోగ నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







