వరుణ్ తేజ్, శ్రీనువైట్ల చిత్రంలో కథానాయిక హెబా
- March 18, 2016
మెగా హీరో వరుణ్ తేజ్, శ్రీనువైట్ల, నల్లమలపు బుజ్జి, మిక్కి జే మేయర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. విజయ్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా వ్యవహారించనున్నాడు. ఇలా టెక్నికల్ టీం మొత్తాన్ని సిద్ధం చేసుకున్న దర్శకుడు ఈ చిత్రంలో నటించనున్న కథానాయికలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే లావణ్య త్రిపాఠి పేరు వినిపిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్గా హెబా పటేల్ను ఖరారు చేసినట్లు తెలిసింది. 'కుమారి 21 ఎఫ్' సినిమాతో కుర్రకారును కిర్కెక్కించిన హెబాపటేల్ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఆ కోవలోనే తాజాగా వరుణ్ తేజ్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ సరసన ఓ చిత్రంలో అలాగే విష్ణు,రాజ్ తరుణ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'ఈడోరకం ఆడోరకం' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.వీటితోపాటుగా బెక్కం వేణుగోపాల్ నిర్మించనున్న 'నేను నా బాయ్ ఫ్రెండ్స్' అనే చిత్రంలోనూ నటించనుంది.
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







