వరుణ్ తేజ్, శ్రీనువైట్ల చిత్రంలో కథానాయిక హెబా
- March 18, 2016
మెగా హీరో వరుణ్ తేజ్, శ్రీనువైట్ల, నల్లమలపు బుజ్జి, మిక్కి జే మేయర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. విజయ్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా వ్యవహారించనున్నాడు. ఇలా టెక్నికల్ టీం మొత్తాన్ని సిద్ధం చేసుకున్న దర్శకుడు ఈ చిత్రంలో నటించనున్న కథానాయికలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే లావణ్య త్రిపాఠి పేరు వినిపిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్గా హెబా పటేల్ను ఖరారు చేసినట్లు తెలిసింది. 'కుమారి 21 ఎఫ్' సినిమాతో కుర్రకారును కిర్కెక్కించిన హెబాపటేల్ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఆ కోవలోనే తాజాగా వరుణ్ తేజ్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ సరసన ఓ చిత్రంలో అలాగే విష్ణు,రాజ్ తరుణ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'ఈడోరకం ఆడోరకం' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.వీటితోపాటుగా బెక్కం వేణుగోపాల్ నిర్మించనున్న 'నేను నా బాయ్ ఫ్రెండ్స్' అనే చిత్రంలోనూ నటించనుంది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







