షిర్డీకి విమాన ప్రయాణం కల త్వరలో
- March 18, 2016
ఎంతో కాలంగా సాయి భక్తులు ఎదురు చూస్తున్న షిర్డీకి విమాన ప్రయాణం కల త్వరలో సాకారం అవుతోంది. షిర్డీకి సమీపంలో మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ (ఎంఏడీసీ) విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయనుంది. రన్వే, ట్యాక్సీ వే, టెర్మినల్ నిర్మాణం పూర్తి అయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తోపాటు నీరు, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాల్సి ఉంది.2,500 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్వే ఏర్పాటైంది. విమానాశ్రయంలో ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రై వేటు విమానాలకు అనుమతి ఇవ్వనున్నారు. జనవరి నుంచి వాణిజ్య అవసరాలకు ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుందని ఎంఐడీసీ అధికారులు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.ప్రస్తుతం షిర్డీకి రైలు సౌకర్యం కూడా ఉంది. విమానాశ్రయం ప్రారంభమైతే వేలాది మంది భక్తులకు పెద్ద ఊరట లభించనుంది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









