ఉమ్రా కంపెనీలపై జరిమానాలను రద్దు
- October 22, 2021సౌదీ: వీసా నిబంధనలను ఉల్లంఘించారని పలు ఉమ్రా కంపెనీలకు విధించిన జారిమానాలను మక్కాలోని అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ రద్దు చేసింది. జరిమానా విధించే విషయంలో సంబంధిత అధికారులు నిబంధనలు పాటించలేదని ఉమ్రా కంపెనీలు అప్పిల్స్ కోర్టులో అప్పీల్ చేయడంతో ఈ మేరకు జరిమానాలను రద్దు చేస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆరు గంటలు ఆలస్యంగా యాత్రికులు వచ్చారంటూ ఎనిమిది మంది ఉమ్రా ఆపరేటర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించారంటూ సంబంధిత అధికారులు జరిమానాలు విధించారు. యాత్రికులు ఆలస్యంగా రావడం అనేది తమ నియంత్రణలో లేని అంశం అని.. జరిమానా నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ ఆపరేటర్లు.. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. వీసా ఉల్లంఘనకు సంబంధించిన అన్ని నిబంధనలను పరిశీలించిన తర్వాత జరిమానాలను రద్దు చేస్తూ కోర్టు తన తీర్పును వెలువరించింది.
తాజా వార్తలు
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!