ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- May 13, 2024
విదేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఓటర్లు!
న్యూ ఢిల్లీ: మొత్తానికి ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళి మాత్రం అనూహ్యంగా పెరిగే అవకాశం కనిస్తుంది. ఎన్ఆర్ఐలు లక్షలు ఖర్చు పెట్టుకుని కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు! ఎక్కువ మంది యువ జంటలు కనిపిస్తున్నారు, సహజంగా డిమాండ్ వున్నప్పుడు ఫ్లైట్ రేట్లు అమాంతంగా పెంచేస్తుంటారు! అయినా ఎవ్వరూ వెనకడుగు వేయలేదు! ఉత్సాహంగా ఓటు కోసం వస్తున్నారు! చాలా సంతోషం వేసింది!
తెలంగాణ ప్రవాసుల కన్నా ఆంధ్రప్రదేశ్ వాళ్లే ఎక్కువగా రావడం విశేషం! అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటమే కారణం! రాష్ట్ర భవిష్యత్, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చుకు వెనకాడకుండా కసిగా వచ్చినట్లు చాలా మంది చెప్పారు. ఏ ఒక్కరో కాకుండా కుటుంబ సభ్యులతో కలసి రావడం మరో విశేషం! నిజంగా అభినందనీయం! ఇక్కడే ఇండియా లో ముఖ్యంగా స్థానికంగా ఉండి సెలవు రోజు ఏదొక టూర్ కు వెళ్ళేవారి కన్నా వీళ్ళు నయం! వీళ్ళను స్ఫూర్తిగా తీసుకుని అందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి! ఒక బాధ్యతగా భావించి మేలు చేసే నాయకులను ఎన్నుకోవాలి! ఈ లెక్కన చూస్తే ఓటు సరళి విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది!
తాజా వార్తలు
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!







