ఇస్తాంబుల్లో ఆత్మాహుతి దాడి నలుగురి మృతి
- March 19, 2016
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలోప్రభుత్వ భవన సముదాయాలు ఉన్న ఇస్టిక్లాల్ వీధిలోని రద్దీ వ్యాపార సముదాయం వద్ద శనివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో కనీసం నలుగురు మరణించగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. ఇది కుర్దిష్ తీవ్ర వాదుల పనేనని టర్కీ ప్రభుత్వం ఆరోపించింది. స్థానిక కాలమానం ప్రకారం 11గంటల సమయంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దీంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. తర్వాత ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గాయపడిన వారిలో కొందరు ఇజ్రాయిలీలు, ఇద్దరు ఐరిష్ జాతీయులు, జర్మనీ, ఐస్లాండ్, దుబాయ్, ఇరాన్లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.
దీనిపై టర్కీ అధ్యక్షులు ఎర్డగాన్ మాట్లాడుతూ.. ''టర్కీ దళాల ఓటమి చవిచూసిన ఉగ్రవాదులు అసహనంతో సామాన్యులపై దాడులకు దిగుతున్నాయి'' అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









