ఇస్తాంబుల్లో ఆత్మాహుతి దాడి నలుగురి మృతి
- March 19, 2016
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలోప్రభుత్వ భవన సముదాయాలు ఉన్న ఇస్టిక్లాల్ వీధిలోని రద్దీ వ్యాపార సముదాయం వద్ద శనివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో కనీసం నలుగురు మరణించగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. ఇది కుర్దిష్ తీవ్ర వాదుల పనేనని టర్కీ ప్రభుత్వం ఆరోపించింది. స్థానిక కాలమానం ప్రకారం 11గంటల సమయంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దీంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. తర్వాత ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గాయపడిన వారిలో కొందరు ఇజ్రాయిలీలు, ఇద్దరు ఐరిష్ జాతీయులు, జర్మనీ, ఐస్లాండ్, దుబాయ్, ఇరాన్లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.
దీనిపై టర్కీ అధ్యక్షులు ఎర్డగాన్ మాట్లాడుతూ.. ''టర్కీ దళాల ఓటమి చవిచూసిన ఉగ్రవాదులు అసహనంతో సామాన్యులపై దాడులకు దిగుతున్నాయి'' అన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







