పాక్ పై భారత్ విజయభేరి
- March 19, 2016
టి20 వల్డ్ కప్ పోటీల్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 119 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. కోహ్లీ 55, యువరాజ్ 24 పరుగులు, ధోనీ 13 పరుగులు, రోహిత్ శర్మ 10 పరుగులు, శిఖర్ ధావన్ ఆరు పరుగులు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. షర్జీల్ ఖాన్ 17, అహ్మద్ షెహజాద్ 25 పరుగులు, ఆఫ్రిదీ 8, అక్మల్ 22, షోయబ్ మాలిక్ 26 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నెహ్రా, బుమ్రా, రైనా, జడేజా, పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. పాక్ బౌలర్లలో సమీ రెండు వికెట్లు తీశాడు. అమీర్, రియాజ్ చెరొక వికెట్ సాధించారు. 37 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 55 పరుగులు చేసిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
తాజా వార్తలు
- అనుమానాస్పద కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం.. నివాసితుడికి షార్జా పోలీసుల సత్కారం
- బంగాళాఖాతంలో అల్పపీడనం..పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్..
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు కీలక సూచనలు.. నిషేధిత, పరిమిత వస్తువుల పూర్తి జాబితా
- రియాద్లో ఘనంగా ‘ఇండియా ఉత్సవ్’..
- ఆగస్టు 31న ‘యాక్సిడెంట్-ఫ్రీ డే’..
- తెలంగాణ లో కొత్తగా TG SAFE
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!







