పాక్ పై భారత్ విజయభేరి
- March 19, 2016టి20 వల్డ్ కప్ పోటీల్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 119 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. కోహ్లీ 55, యువరాజ్ 24 పరుగులు, ధోనీ 13 పరుగులు, రోహిత్ శర్మ 10 పరుగులు, శిఖర్ ధావన్ ఆరు పరుగులు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. షర్జీల్ ఖాన్ 17, అహ్మద్ షెహజాద్ 25 పరుగులు, ఆఫ్రిదీ 8, అక్మల్ 22, షోయబ్ మాలిక్ 26 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నెహ్రా, బుమ్రా, రైనా, జడేజా, పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. పాక్ బౌలర్లలో సమీ రెండు వికెట్లు తీశాడు. అమీర్, రియాజ్ చెరొక వికెట్ సాధించారు. 37 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 55 పరుగులు చేసిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం