భారత్ ఘనవిజయం పట్ల ప్రధాని మోదీ సంతోషం...
- March 19, 2016
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాక్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. చిరకాల ప్రత్యర్థిపై ఘన విజయం సాధించడంతో టీమిండియాకు ఆయన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. శనివారం జరిగిన మ్యాచ్లో 18 ఓవర్లకు పాకిస్థాన్ 118 పరుగులు చేయగా.. భారత్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించించిన సంగతి తెలిసిందే. మిన్నంటిన సంబరాలు పాకిస్థాన్పై భారత్ విజయం సాధించడతో దేశంలో సంబరాలు మిన్నంటాయి. కశ్మీర్ ప్రజలు బాణసంచా కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు.సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఉన్న భారత్ సైనిక బలగాలు సైతం ఈ వేడుకల్లో పాలుపంచుకున్నాయి.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







