భారత్‌ ఘనవిజయం పట్ల ప్రధాని మోదీ సంతోషం...

- March 19, 2016 , by Maagulf
భారత్‌ ఘనవిజయం  పట్ల ప్రధాని మోదీ సంతోషం...

 కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. చిరకాల ప్రత్యర్థిపై ఘన విజయం సాధించడంతో టీమిండియాకు ఆయన ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో 18 ఓవర్లకు పాకిస్థాన్‌ 118 పరుగులు చేయగా.. భారత్‌ మరో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించించిన సంగతి తెలిసిందే. మిన్నంటిన సంబరాలు పాకిస్థాన్‌పై భారత్‌ విజయం సాధించడతో దేశంలో సంబరాలు మిన్నంటాయి. కశ్మీర్‌ ప్రజలు బాణసంచా కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు.సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఉన్న భారత్‌ సైనిక బలగాలు సైతం ఈ వేడుకల్లో పాలుపంచుకున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com