కమ్ముకున్న పొగమంచు...వాహనదారులు అలర్ట్ గా ఉండాలన్న అధికారులు
- November 05, 2021
యూఏఈ: దుబాయ్, అబుధాబి లలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది. శుక్రవారం తెల్లవారుజామున 1 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య యూఏఈలోని పలుచోట్ల దట్టమైన పొగమంచు ఉంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (NCM) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ వరుస ట్వీట్లలో తెలిపింది. ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ బోర్డులపై ప్రదర్శించబడే స్పీడ్ లిమిట్స్ పాటించాలని అబుదాబి పోలీసులు ట్వీట్ చేశారు. పొగమంచు ఉన్న ఏరియాల్లో వాహనదారులు సురక్షితంగా నడపాలని, వాహనదారులు వాహనాల మధ్య దూరం పాటించాలని షార్జా పోలీసులు వాహనదారులను కోరారు. దుబాయ్, అబుదాబిలలో గాలిలో తేమ శాతం 90 నుండి 95 శాతానికి చేరుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు, దుబాయ్, అబుదాబిలలో ఉష్ణోగ్రతలు తగ్గుతూనే ఉన్నాయని.. అల్ క్వాలో 20 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







