కమ్ముకున్న పొగమంచు...వాహనదారులు అలర్ట్ గా ఉండాలన్న అధికారులు
- November 05, 2021
యూఏఈ: దుబాయ్, అబుధాబి లలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది. శుక్రవారం తెల్లవారుజామున 1 గంటల నుంచి ఉదయం 9 గంటల మధ్య యూఏఈలోని పలుచోట్ల దట్టమైన పొగమంచు ఉంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (NCM) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ వరుస ట్వీట్లలో తెలిపింది. ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ బోర్డులపై ప్రదర్శించబడే స్పీడ్ లిమిట్స్ పాటించాలని అబుదాబి పోలీసులు ట్వీట్ చేశారు. పొగమంచు ఉన్న ఏరియాల్లో వాహనదారులు సురక్షితంగా నడపాలని, వాహనదారులు వాహనాల మధ్య దూరం పాటించాలని షార్జా పోలీసులు వాహనదారులను కోరారు. దుబాయ్, అబుదాబిలలో గాలిలో తేమ శాతం 90 నుండి 95 శాతానికి చేరుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు, దుబాయ్, అబుదాబిలలో ఉష్ణోగ్రతలు తగ్గుతూనే ఉన్నాయని.. అల్ క్వాలో 20 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
తాజా వార్తలు
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!







