ప్లేటుతో బాయ్ఫ్రెండుని చంపిన కేసులో నిందితురాలికి ఊరట
- November 05, 2021
బహ్రెయిన్: ఓ మహిళ, ఓ వ్యక్తిపై ప్లేటుతో దాడి చేయడంతో, ఆ వ్యక్తి మృతి చెందాడు. అయితే, ఈ కేసులో నిందితురాలిపై మోపబడిన హత్య కేసు నుంచి ఆమెకు న్యాయస్థానం ఊరట కల్పించింది. బాధితుడ్ని నిందితురాలు ప్లేటుతో కొట్టిన మాట వాస్తవమే అయినా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా మాత్రమే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయపడ్డ ఆ వ్యక్తిని నిందితురాలు ఆసుపత్రికి తరలించడం జరిగింది. మృతుడు తనకు స్పాన్సర్ అనీ, అనుకోకుండా జరిగిన ఘటన అనీ ఆమె న్యాయస్థానం యెదుట వాదనలు వినిపించింది. అంతకు ముందు ఆ మహిళపై ఎలాంటి నేర చరిత్రకు సంబంధించిన ఆధారాలు లేకపోవడం, అనుకోకుండా జరిగిన ఘటన అని విచారణ సందర్భంగా నిర్ధారణకు రావడంతో, హత్య కేసు నుంచి ఆమెకు ఊరటనిచ్చింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







