ప్లేటుతో బాయ్ఫ్రెండుని చంపిన కేసులో నిందితురాలికి ఊరట
- November 05, 2021
బహ్రెయిన్: ఓ మహిళ, ఓ వ్యక్తిపై ప్లేటుతో దాడి చేయడంతో, ఆ వ్యక్తి మృతి చెందాడు. అయితే, ఈ కేసులో నిందితురాలిపై మోపబడిన హత్య కేసు నుంచి ఆమెకు న్యాయస్థానం ఊరట కల్పించింది. బాధితుడ్ని నిందితురాలు ప్లేటుతో కొట్టిన మాట వాస్తవమే అయినా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా మాత్రమే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయపడ్డ ఆ వ్యక్తిని నిందితురాలు ఆసుపత్రికి తరలించడం జరిగింది. మృతుడు తనకు స్పాన్సర్ అనీ, అనుకోకుండా జరిగిన ఘటన అనీ ఆమె న్యాయస్థానం యెదుట వాదనలు వినిపించింది. అంతకు ముందు ఆ మహిళపై ఎలాంటి నేర చరిత్రకు సంబంధించిన ఆధారాలు లేకపోవడం, అనుకోకుండా జరిగిన ఘటన అని విచారణ సందర్భంగా నిర్ధారణకు రావడంతో, హత్య కేసు నుంచి ఆమెకు ఊరటనిచ్చింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..
- BCCI Naman Awards: మిథాలీ రాజ్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా









