ప్లేటుతో బాయ్ఫ్రెండుని చంపిన కేసులో నిందితురాలికి ఊరట
- November 05, 2021
బహ్రెయిన్: ఓ మహిళ, ఓ వ్యక్తిపై ప్లేటుతో దాడి చేయడంతో, ఆ వ్యక్తి మృతి చెందాడు. అయితే, ఈ కేసులో నిందితురాలిపై మోపబడిన హత్య కేసు నుంచి ఆమెకు న్యాయస్థానం ఊరట కల్పించింది. బాధితుడ్ని నిందితురాలు ప్లేటుతో కొట్టిన మాట వాస్తవమే అయినా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా మాత్రమే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయపడ్డ ఆ వ్యక్తిని నిందితురాలు ఆసుపత్రికి తరలించడం జరిగింది. మృతుడు తనకు స్పాన్సర్ అనీ, అనుకోకుండా జరిగిన ఘటన అనీ ఆమె న్యాయస్థానం యెదుట వాదనలు వినిపించింది. అంతకు ముందు ఆ మహిళపై ఎలాంటి నేర చరిత్రకు సంబంధించిన ఆధారాలు లేకపోవడం, అనుకోకుండా జరిగిన ఘటన అని విచారణ సందర్భంగా నిర్ధారణకు రావడంతో, హత్య కేసు నుంచి ఆమెకు ఊరటనిచ్చింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- Dubai Police Warns Against Fake Websites Selling Dubai Global Village Packages
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా