ఫైజర్ టాబ్లెట్ తో కరోనా నుంచి 90 శాతం రక్షణ
- November 06, 2021
కరోనా మహమ్మరి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో తెలిసిందే. ఈ మహమ్మరి నివారణకు ఇప్పటికీ కూడా ఎలాంటి మందు లేదు. కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకే వ్యాక్సిన్లు, ట్రీట్ మెంట్లు చేస్తున్నారు. కానీ ఇది పూర్తిస్థాయిలో రక్షణ ఇవ్వటం లేదు. కరోనా విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న తరుణంలో ఫైజర్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. తమ కంపెనీ కొత్తగా తేనున్న యాంటీ వైరల్ టాబ్లెట్ కరోనా నుంచి దాదాపు 90 శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపింది.హాస్పిటలైజేషన్ గానీ డెత్ రేటు ను గానీ ఫైజర్ తేనున్న టాబ్లెట్ తో 90 శాతం తగ్గించవచ్చని సంస్థ గట్టిగా చెబుతోంది.ఇప్పటికీ కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ కోసం ఐవీ ప్లూయిడ్స్, ఇంజక్షన్స్ ఇస్తున్నారు.కానీ ఫైజర్ తేనున్న టాబ్లెట్ తో ఎలాంటి ఇంజెక్షన్స్ అవసరం లేకుండానే కరోనా నుంచి విముక్తి పొందవచ్చంట. ఐతే ఈ టాబ్లెట్ మార్కెట్ లోకి రావటానికి కాస్త టైమ్ పట్టనుంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు అనుమతుల కోసం కంపెనీ అప్లయ్ చేసింది. వారి నుంచి అనుమతి వస్తే ఈ టాబ్లెట్ మార్కెట్ లోకి వస్తుంది. పాక్స్ లోవిడ్ పేరుతో కొత్త టాబ్లెట్ ను మార్కెట్ లోకి తెస్తామని ఫైజర్ సంస్థ ప్రకటించింది.దీంతో ఈ టాబ్లెట్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







