వీసాల జారీ ప్రక్రియ మళ్లీ షురూ

- November 07, 2021 , by Maagulf
వీసాల జారీ ప్రక్రియ మళ్లీ షురూ

కువైట్: కరోనా కారణంగా నిలిపివేసిన  వీసాల జారీ ప్రక్రియను కువైట్ ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో మళ్లీ వీసాలు జారీ చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎంట్రీ వీసాలు, ఫ్యామిలీ యూనియన్ కు సంబంధించిన వీసాలకు గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని అంతర్గత వ్యవహారాల మినిస్ట్రీ తెలిపింది. అన్ని గవర్నేట్ ల పరిధిలో వీసా అప్లికేషన్స్ ను స్వీకరించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియల్ (MOI) వెబ్ సైట్ లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కువైట్ లో ఉద్యోగం చేస్తున్న వారికి సంబంధించి  వారి పిల్లలు  16 ఏళ్ల లోపు వారైతే వారి పేరెంట్స్ తో ఉండేందుకు వీసాలు ఇవ్వనున్నారు. ఇక అన్ని కమర్షియల్, బిజినెస్ వీసాలతో పాటు హౌస్ హెల్పర్స్ కు సంబంధించిన వీసాలను  కూడా గతంలో మాదిరిగానే ఇష్యూ చేస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐతే కువైట్ వీసా కోసం అప్లయ్ చేసే వారు కచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను సమర్పించాలని కండిషన్ పెట్టింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com