ఎమిరేట్స్ రోడ్డు లో యాక్సిడెంట్. మూడు ఒంటెల మృతి
- November 08, 2021
యూఏఈ : కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మూడు ఒంటెలు చనిపోయిన ఘటన ఎమిరేట్స్ రోడ్ లో జరిగింది. మరో మూడు ఒంటెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఒంటెలు రోడ్డు దాటుతుండగా అరబ్ డ్రైవర్ ఒకరు కారుతో వేగంగా వాటిని ఢీకొట్టాడు. దీంతో స్పాట్ లోనే మూడు ఒంటెలు చనిపోయాయి. కారు డ్రైవర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. యాక్సిడెంట్ స్పాట్ కి పోలీసులు చేరుకునే లోపే అతను పరారయ్యాడు. డ్రైవింగ్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా వాహనాదారులు అన్ని సేప్టీ మెజర్స్ పాటించాలని ఈ సందర్భంగా పోలీసులు కోరారు. పొగమంచు దట్టంగా ఉందని...ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తుండగా మొబైల్ లో మాట్లాడటం చేయొద్దని, సీటు బెల్ట్ లేకుండా వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









