లూలూ గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీకి ప్రీమదూత అవార్డు..!
- November 08, 2021
అబుధాబి: ప్రముఖ పారిశ్రామిక వేత్త, లూలూ గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీ.. ఇండోనేషియాలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ప్రీమదూత అవార్డును అందుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడి చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇండోనేషియా ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేసింది. కాగా.. యూసుఫ్ అలీ ఈ సందర్భంగా ఇండోనేషియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇండోనేషియాలో మరిన్ని హైపర్ మార్కెట్లను ప్రారంభిస్తానన్నారు. ఈ-కామర్స్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని కూడా పేర్కొన్నారు. కాగా.. అబుధాబిలో ఎమిరేట్స్ ప్యాలెస్లో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









