లూలూ గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీకి ప్రీమదూత అవార్డు..!
- November 08, 2021
అబుధాబి: ప్రముఖ పారిశ్రామిక వేత్త, లూలూ గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీ.. ఇండోనేషియాలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ప్రీమదూత అవార్డును అందుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడి చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇండోనేషియా ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేసింది. కాగా.. యూసుఫ్ అలీ ఈ సందర్భంగా ఇండోనేషియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇండోనేషియాలో మరిన్ని హైపర్ మార్కెట్లను ప్రారంభిస్తానన్నారు. ఈ-కామర్స్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని కూడా పేర్కొన్నారు. కాగా.. అబుధాబిలో ఎమిరేట్స్ ప్యాలెస్లో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







