రెసిడెన్సీ ఉల్లంఘనులకు క్షమాభిక్ష లేదు
- November 12, 2021
కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్తగా క్షమాభిక్ష పెట్టేది లేదని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. కోవిడ్ నేపథ్యంలో మానవీయ కోణంలో నాలుగుసార్లు క్షమాభిక్షకు అవకాశం కల్పించినట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఎలాంటి జరీమానా చెల్లించకుండా, ఉచితంగా టిక్కెట్లను కల్పించి మరీ దేశం విడిచి వెళ్ళేందుకు కొందరికి అవకాశం కల్పించిన కువైట్, కొందరు ఉల్లంఘనులు తమ స్టేటస్ సరి చేసుకునేందుకూ అవకాశం ఇచ్చింది. అయినాగానీ, సుమారుగా 160,000 మంది ఉల్లంఘనులు క్షమాభిక్షను వినియోగించుకోలేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని అథారిటీస్ స్పష్టం చేశాయి. జరీమానా చెల్లించి ఉల్లంఘనులు దేశం విడిచి వెళ్ళాలనీ, అనంతరం వారు కొత్త వీసాపై తిరిగి వచ్చేందుకు అవకాశం వుందని కువైట్ పేర్కొంది. అలా ముందుకు రాని వారిని అథారిటీస్ గుర్తించి పట్టుకుని, దేశం నుంచి పంపేస్తే, వారిపై జీవిత కాలం బ్యాన్ వుంటుందని అధికారులు తెలిపారు. వారు జిసిసి దేశాలకు ఐదేళ్ళ వరకు వచ్చేందుకు వీలుండదని కువైట్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









