రాజకీయ నాయకుల తీరుపై భారత ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు
- November 12, 2021
నెల్లూరు: ఈ రోజుల్లో రాజకీయ నాయకులు చేస్తున్న చేష్టలు, మాట్లాడే మాటలు రోత పుట్టిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరులోని ఓ స్థానిక పత్రిక 40ఏళ్ల వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాటలు, తెలుగు కట్టు, బొట్టు చాలారోజుల తరువాత చూడటం సంతోషంగా ఉందన్నారు. ఈ రాజ్యాంగ హోదా అలంకారంగా కనిపిస్తోందన్నారు.

జనంతో కలిసి జనంతో మాట్లాడుతుంటే దానిలో ఉండే ఆనందం ఈ రాజ్యాంగ హోదాలో లేదన్నారు. సంతోషంగా ఉండాలంటే అందరితో కలిసి తిరగాలని ఆయన సూచించారు. చదువు చెప్పిన గురువుని సన్మానించుకోవడం మన బాధ్యత అని ఆయన అన్నారు. కరోనాను ఎదిరించడంలో ముందుండి అశువులు బాసిన జర్నలిస్టులు, వైద్యసిబ్బందికి ఆయన నివాళులర్పించారు. అనంతరం 40 మంది నెల్లూరు ప్రముఖులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతిని సన్మానించారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









