జర్నలిస్ట్లకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- November 12, 2021
హైదరాబాద్: జర్నలిస్ట్ పాస్లు ఉన్నవారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) శుభవార్త తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గుడ్ న్యూస్ ఫర్ అవర్ న్యూస్ ఫ్రెండ్స్ అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఆర్టీసీ నుంచి వ్యాలీడ్ బస్పాస్ కలిగి ఉన్న జర్నలిస్టులు ఇకపై తమ టికెట్లపై రాయితీని ఆన్లైన్లోనే పొందవచ్చని ఆయన తెలిపారు. టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా జర్నలిస్టులు తమ కన్సెషన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. గతంలో జర్నలిస్టులు తమ టికెట్లపై రాయితీని ఆన్లైన్లో పొందే వెసులుబాటు లేదు. నేరుగా బస్ కండక్టర్ నుంచి మాత్రమే రాయితీ టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. జర్నలిస్టులకు ఆన్లైన్లో టికెట్ల విషయమై సలహా ఇచ్చిన డీ అభినయ్, ఎన్వీ నాగార్జునకు కృతజ్ఞతలు అని సజ్జనార్ తన ట్వీట్ చివరలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!







