దుబాయ్ ఎక్స్‌పో 2020లో ప్రపంచపు ప్రఖ్యాత రన్నర్ 'ఉసేన్ బోల్ట్‌'

- November 13, 2021 , by Maagulf
దుబాయ్ ఎక్స్‌పో 2020లో ప్రపంచపు ప్రఖ్యాత రన్నర్ \'ఉసేన్ బోల్ట్‌\'

దుబాయ్: ప్రపంచపు ప్రఖ్యాత రన్నర్ 'ఉసేన్ బోల్ట్‌' నేడు దుబాయ్ ఎక్స్‌పో 2020లో 'రన్ ది వరల్డ్‌' పేరిట నిర్వహిస్తున్న ఛారిటీ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

క్రీడలు మరియు ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండాలి అనే సామాజిక సందేశాన్ని అందించే ఉద్దేశ్యంతో పెప్సికో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దివ్యాంగుల సహాయార్ధం  సాగే ఈ 1.45 కిలోమీటర్ల ఫ్యామిలీ రన్.. 'అల్ నూర్ రిహాబిలిటేషన్ & వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్'  నిధులను సేకరించడంలో సహాయపడుతుంది అని అధికారులు తెలిపారు. 

ఈ రన్ అనంతరం బోల్ట్ 'మొబిలిటీ డిస్ట్రిక్ట్‌' లోని 'గాటోరేడ్ ది బోల్ట్ పెవిలియన్‌' లో అభిమానులతో మీట్-అండ్-గ్రీట్‌లో బోల్ట్ పాల్గొని తన అభిమానులతో ముచ్చటించారు. దుబాయ్ రావటం, తన అభిమానులను కలవటం ఏంటో ఆనందాన్ని కలిగించింది అని బోల్ట్ ఈ సందర్భంగా అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com