బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం..
- November 13, 2021నందమూరి బాలకృష్ణ సక్సెస్ ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మాస్ ఎంటర్టైనర్ ఈరోజు హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.
చిత్ర యూనిట్ మొత్తం లాంచ్కి హాజరయ్యారు. ముహూర్తం షాట్కు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, వివి వినాయక్ క్లాప్ కొట్టారు, బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేసారు. కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు సానా సినిమా స్క్రిప్ట్ని టీమ్కి అందజేశారు. జనవరి 2022లో రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, థమన్ సంగీత దర్శకుడు. యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ మాస్ ఎంటర్టైనర్ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో కొంత భాగాన్ని అమెరికాలో చిత్రీకరించనున్నారు. గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రానికి తాత్కాలికంగా 'జై బాలయ్య' అనే టైటిల్ ఖరారు చేయగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన