ప్రపంచ కప్ కైవసం చేసుకున్న ఆసీస్.!
- November 15, 2021
దుబాయ్: దుబాయ్ క్రికెట్ స్టేడియం లో ఈరోజు జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా జట్టు. అయితే నేటి ఫైనల్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్(85) పరుగులతో రాణించడం వల్ల ఆ జట్టు 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. ఆ తర్వాత 173 పరుగుల లక్ష్యంతో వచ్చిన ఆసీస్ జట్టు కెప్టెన్ ఫించ్ కేవలం 5 పరుగులు చేసే ఔట్ అయిన మరో ఓపెనర్ వార్నర్ (53) అర్ధశతకం పూర్తి చేసాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్ అద్భుతంగా రాణిస్తూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. మార్ష్ 50 బంతుల్లో 77 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో ఉండగా మాక్స్వెల్ 18 బంతుల్లో 28 పరుగులు చేసాడు. ఇక ఆసీస్ కు చివరి 14 బంతుల్లో 4 పరుగులు కావాల్సి ఉండగా… మాక్స్వెల్ బౌండరీతో ఆసీస్ జట్టు మొదటిసారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకుంది. దాంతో ఆసీస్ ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







