ప్రపంచ కప్ కైవసం చేసుకున్న ఆసీస్.!
- November 15, 2021
దుబాయ్: దుబాయ్ క్రికెట్ స్టేడియం లో ఈరోజు జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా జట్టు. అయితే నేటి ఫైనల్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్(85) పరుగులతో రాణించడం వల్ల ఆ జట్టు 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. ఆ తర్వాత 173 పరుగుల లక్ష్యంతో వచ్చిన ఆసీస్ జట్టు కెప్టెన్ ఫించ్ కేవలం 5 పరుగులు చేసే ఔట్ అయిన మరో ఓపెనర్ వార్నర్ (53) అర్ధశతకం పూర్తి చేసాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్ అద్భుతంగా రాణిస్తూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. మార్ష్ 50 బంతుల్లో 77 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో ఉండగా మాక్స్వెల్ 18 బంతుల్లో 28 పరుగులు చేసాడు. ఇక ఆసీస్ కు చివరి 14 బంతుల్లో 4 పరుగులు కావాల్సి ఉండగా… మాక్స్వెల్ బౌండరీతో ఆసీస్ జట్టు మొదటిసారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకుంది. దాంతో ఆసీస్ ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు