యూఏఈ లో భూకంపం.!
- November 15, 2021
యూఏఈ: ఆదివారం ఇరాన్లో జంట భూకంపాలు రావడంతో యూఏఈలో ప్రకంపనలు వచ్చాయి. దుబాయ్, షార్జా, రాస్ అల్ ఖైమా మరియు అబుదాబిలోని నివాసితులు "రెండు నుండి మూడు నిమిషాల" వరకు ప్రకంపనలు అనుభవించినట్లు నివేదించారు. ప్రజల భద్రత కోసం భవనాలు ఖాళీ చేయబడ్డాయి.

సాయంత్రం 4.07 గంటలకు దక్షిణ ఇరాన్ లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఈ ప్రకంపనలు వచ్చినట్లు యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) ధృవీకరించింది. సాయంత్రం 4.08 గంటలకు 6.7 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది.
జుమేరా లేక్ టవర్స్, నాహ్దా,దెయిరా, బర్షా, దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్ పార్క్ మరియు డిస్కవరీ గార్డెన్స్ వంటి కమ్యూనిటీలలో ప్రకంపనలు సంభవించినట్లు నివాసితులు నివేదించారు. రాస్ అల్ ఖైమాలోని కొన్ని కమ్యూనిటీలతో పాటు షార్జాలోని అల్ నహ్దా, మహట్టా మరియు కార్నిష్ లోని వారు కూడా దీన్ని గుర్తించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







