యూఏఈ లో భూకంపం.!
- November 15, 2021
యూఏఈ: ఆదివారం ఇరాన్లో జంట భూకంపాలు రావడంతో యూఏఈలో ప్రకంపనలు వచ్చాయి. దుబాయ్, షార్జా, రాస్ అల్ ఖైమా మరియు అబుదాబిలోని నివాసితులు "రెండు నుండి మూడు నిమిషాల" వరకు ప్రకంపనలు అనుభవించినట్లు నివేదించారు. ప్రజల భద్రత కోసం భవనాలు ఖాళీ చేయబడ్డాయి.

సాయంత్రం 4.07 గంటలకు దక్షిణ ఇరాన్ లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఈ ప్రకంపనలు వచ్చినట్లు యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్సిఎం) ధృవీకరించింది. సాయంత్రం 4.08 గంటలకు 6.7 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది.
జుమేరా లేక్ టవర్స్, నాహ్దా,దెయిరా, బర్షా, దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్ పార్క్ మరియు డిస్కవరీ గార్డెన్స్ వంటి కమ్యూనిటీలలో ప్రకంపనలు సంభవించినట్లు నివాసితులు నివేదించారు. రాస్ అల్ ఖైమాలోని కొన్ని కమ్యూనిటీలతో పాటు షార్జాలోని అల్ నహ్దా, మహట్టా మరియు కార్నిష్ లోని వారు కూడా దీన్ని గుర్తించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







