దుబాయ్ ఎక్స్ పో-2020 కి విశేష స్పందన...

- November 16, 2021 , by Maagulf
దుబాయ్ ఎక్స్ పో-2020 కి విశేష స్పందన...

దుబాయ్:దుబాయ్ ఎక్స్ పో- 2020 కి విశేష స్పందన లభిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి లక్షలాదిగా విజిటర్స్ ఇక్కడకు తరలి వస్తున్నారు. ప్రపంచ దేశాల పెవిలియన్లతో ఇదో మిని వరల్డ్ ను తలపిస్తోంది. భిన్న సంస్కృతులు, రకరకాల ఫుడ్స్, వివిధ దేశాల చరిత్రను తెలుసుకునే అవకాశం ఉండటంతో దుబాయ్ ఎక్స్ పో కు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన కనిపిస్తోంది. కేవలం ఆరు వారాల్లోనే 35 లక్షల మందికి పైగా ఈ ఎక్స్ పో సందర్శించటం విశేషం. మరో నాలుగున్నర నెలల పాటు ఎక్స్ పో కొనసాగనుంది. ఎక్స్ పో పూర్తయ్యే నాటికి దాదాపు 2 కోట్ల మంది విజిటర్స్ సందర్శించారని అంచనా వేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com