వచ్చే ఏడాది ప్రపంచ కప్ జరిగే వేదికల వివరాలు...
- November 16, 2021
ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ నిర్వహణ హక్కులు మన బీసీసీఐకి ఉన్న కరోనా కారణంగా దానిని యూఏఈ వేదికగా నిర్వహించాల్సి వచ్చింది.ఇక వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న విషయం తెలిసిందే.కాబట్టి ఇప్పుడు అందరూ దాని వైపు చూస్తున్నారు.ఇక తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా టీ20 ప్రపంచ కప్ 2022 నిర్వహించే వేదికలను ప్రకటించింది.ఈ ప్రపంచ కప్ లో జరగనున్న 45 మ్యాచ్ లు మొత్తం అడిలైడ్, బ్రిస్బేన్,గీలాంగ్,హోబర్ట్,మెల్బోర్న్,పెర్త్ మరియు సిడ్నీ వేదికలుగా జరుగుతాయి.ఈ టోర్నమెంట్ అక్టోబర్ 16న ప్రారంభమై నవంబర్ 13న మెల్బోర్న్ మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది.అయితే నవంబర్ 9,10 తేదీల్లో ఈ టోర్నీ యొక్క సెమీ ఫైనల్ మ్యాచ్ లు సిడ్నీ మరియు అడిలైడ్ వేదికగా జరుగుతాయి.ఇక ఈ టోర్నీ కోసం ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మొదటి 8 స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా,న్యూజిలాండ్,ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్,ఇండియా,పాకిస్థాన్ మరియు దక్షిణాఫ్రికా జట్లు నేరుగా సూపర్ 12 దశలోకి అర్హత సాధించాయి.మిగిలిన నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్లు జరుగుతాయి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







