జనవరిలో 5-11 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్
- November 17, 2021
ఖతార్: ఖతార్ లో 5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు జనవరిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ విషయాన్ని ఖతార్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. పేరెంట్స్ అంతా తప్పకుండా పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని ప్రభుత్వం కోరింది. వ్యాక్సిన్ చేయించుకున్న వారితో పోల్చితే ఈ ఏజ్ గ్రూప్ లో వ్యాక్సిన్ చేయించుకొని వారి పై కరోనా ఎఫెక్ట్ ఉన్నట్లు చాలా స్టడీస్ లో తేలింది. వ్యాక్సిన్ వేసుకొని పిల్లల్లో 63 శాతం మందికి మైనర్ కరోనా లక్షణాలు వస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రభావం పిల్లలపై ఉండకూడదంటే అందరికీ వ్యాక్సిన్ వేయించాలని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు. పెద్దలకు 30 మైక్రో గ్రామ్స్ డోస్ ఉంటే పిల్లలకు మాత్రం 10 మైక్రో గ్రామ్స్ డోస్ ఇస్తున్నారు. మూడు వారాల వ్యవధిలో వీరికి రెండు డోస్ ల వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని..ఇది పక్కా సేఫ్ అని అధికారులు స్పష్టం చేశారు. 1440 మంది పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చి రెండు నెలల పాటు అబ్జర్వేషన్ లో పెట్టామని వారికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







