జనవరిలో 5-11 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్
- November 17, 2021ఖతార్: ఖతార్ లో 5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు జనవరిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ విషయాన్ని ఖతార్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. పేరెంట్స్ అంతా తప్పకుండా పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని ప్రభుత్వం కోరింది. వ్యాక్సిన్ చేయించుకున్న వారితో పోల్చితే ఈ ఏజ్ గ్రూప్ లో వ్యాక్సిన్ చేయించుకొని వారి పై కరోనా ఎఫెక్ట్ ఉన్నట్లు చాలా స్టడీస్ లో తేలింది. వ్యాక్సిన్ వేసుకొని పిల్లల్లో 63 శాతం మందికి మైనర్ కరోనా లక్షణాలు వస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రభావం పిల్లలపై ఉండకూడదంటే అందరికీ వ్యాక్సిన్ వేయించాలని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు. పెద్దలకు 30 మైక్రో గ్రామ్స్ డోస్ ఉంటే పిల్లలకు మాత్రం 10 మైక్రో గ్రామ్స్ డోస్ ఇస్తున్నారు. మూడు వారాల వ్యవధిలో వీరికి రెండు డోస్ ల వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని..ఇది పక్కా సేఫ్ అని అధికారులు స్పష్టం చేశారు. 1440 మంది పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చి రెండు నెలల పాటు అబ్జర్వేషన్ లో పెట్టామని వారికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!