ఇది ఆరంభం మాత్రమే..ఇంకా ఉధృతం చేస్తాం: కేసీఆర్ @ మహా ధర్నా

- November 18, 2021 , by Maagulf
ఇది ఆరంభం మాత్రమే..ఇంకా ఉధృతం చేస్తాం: కేసీఆర్ @ మహా ధర్నా

హైదరాబాద్: కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకతతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా గురువారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ మహా ధర్నాలో సీఎం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగినామని అన్నారు. ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ఉధృతం చేస్తామని తెలిపారు. పంజాబ్‌లో కొన్నట్లు ఇక్కడ కూడా వరి ధాన్యం కొనాలని స్వయంగా కోరినట్లు చెప్పారు. ప్రధానికి లేఖ రాసిన ఉలుకు లేదు పలుకు లేదని విమర్శించారు. ఇది ఈ రోజుతో ఆగేది లేదని... దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఉధృతమై ఉప్పెనోలే మారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com