చైనా దూకుడు.. అరుణాచల్లో 60 బిల్డింగ్ల నిర్మాణం.. కొత్త శాటిలైట్ చిత్రాలివే
- November 18, 2021
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లో అక్రమంగా చైనా నిర్మించిన రెండవ గ్రామానికి చెందిన తాజా శాటిలైట్ దృశ్యాలను ఓ జాతీయ మీడియా రిలీజ్ చేసింది. ఆ ప్రాంతంలో చైనా సుమారు 60 బిల్డింగ్లను నిర్మించినట్లు ఆ దృశ్యాల్లో స్పష్టమవుతున్నది. 2019 శాటిలైట్ దృశ్యాల్లో లేని ఆ గ్రామం.. ఏడాది తర్వాత తీసిన చిత్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల అరుణాచల్లో ఓ గ్రామం నిర్మించిన చైనా.. దానికి 93 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున ఈ కొత్త ప్రాంతాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇంటర్నేషన్ బోర్డర్ మధ్య ఉన్న భారత భూభాగంలో సెకండ్ ఎన్క్లేవ్ను నిర్మించినట్లు భావిస్తున్నారు. ఆ ప్రాంతం తమదే అని భారత్ గతంలో పేర్కొన్నది. అయితే కొత్తగా నిర్మించిన ఆ బిల్డింగ్ల్లో ఎవరైనా ఉన్నారా లేదా అన్న విషయం స్పష్టంగా తెలియరావడం లేదు. భారతీయ ఆర్మీ దీనిపై స్పందిస్తూ .. కొత్త నిర్మాణం ఎల్ఏసీకి ఉత్తరం వైపున ఉన్నట్లు పేర్కొన్నది. అరుణాచల్ ప్రదేశ్లోని షి యోమి జిల్లాలో ఉన్న భూభాగంలో ఈ ప్రాంతం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







