చైనా దూకుడు.. అరుణాచల్లో 60 బిల్డింగ్ల నిర్మాణం.. కొత్త శాటిలైట్ చిత్రాలివే
- November 18, 2021
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లో అక్రమంగా చైనా నిర్మించిన రెండవ గ్రామానికి చెందిన తాజా శాటిలైట్ దృశ్యాలను ఓ జాతీయ మీడియా రిలీజ్ చేసింది. ఆ ప్రాంతంలో చైనా సుమారు 60 బిల్డింగ్లను నిర్మించినట్లు ఆ దృశ్యాల్లో స్పష్టమవుతున్నది. 2019 శాటిలైట్ దృశ్యాల్లో లేని ఆ గ్రామం.. ఏడాది తర్వాత తీసిన చిత్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల అరుణాచల్లో ఓ గ్రామం నిర్మించిన చైనా.. దానికి 93 కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపున ఈ కొత్త ప్రాంతాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇంటర్నేషన్ బోర్డర్ మధ్య ఉన్న భారత భూభాగంలో సెకండ్ ఎన్క్లేవ్ను నిర్మించినట్లు భావిస్తున్నారు. ఆ ప్రాంతం తమదే అని భారత్ గతంలో పేర్కొన్నది. అయితే కొత్తగా నిర్మించిన ఆ బిల్డింగ్ల్లో ఎవరైనా ఉన్నారా లేదా అన్న విషయం స్పష్టంగా తెలియరావడం లేదు. భారతీయ ఆర్మీ దీనిపై స్పందిస్తూ .. కొత్త నిర్మాణం ఎల్ఏసీకి ఉత్తరం వైపున ఉన్నట్లు పేర్కొన్నది. అరుణాచల్ ప్రదేశ్లోని షి యోమి జిల్లాలో ఉన్న భూభాగంలో ఈ ప్రాంతం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం
- తన పేరుతో సేవా సంస్థలు ఏర్పాటు పై కేటీఆర్ స్పందన
- ప్రమాదంలో గ్రామ సచివాలయాలు: పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వ్యవస్థాగత వైఫల్యాలు బహిర్గతం
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!









