ఎన్టీఆర్ షోలో గెస్ట్‌గా మహేష్ బాబు

- November 20, 2021 , by Maagulf
ఎన్టీఆర్ షోలో గెస్ట్‌గా మహేష్ బాబు

యంగ్‌ టైగన్‌ ఎన్టీఆర్‌ ”ఎవరు మీలో కోటీశ్వరులు” షో తో తెలుగు ప్రేక్షకాభిమానులను తన దైన స్టైల్‌ లో ఎంటర్‌ టైన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఎపిసోడ్‌ కు సినీ సెలబ్రీటీలు కూడా రావడం తో టీఆర్పీ రేటింగ్‌ ఆమాంతం పెరిగి పోయింది.

ఇది వరకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, దర్శకుడు రాజమౌళి అలాగే.. టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత.. వచ్చి ఎంటర్ టైన్‌ చేయగా… తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూడా అందరినీ అలరించేందుకు సిద్దం అయ్యాడు.

అవును ”ఎవరు మీలో కోటీశ్వరులు” షో కి గెస్ట్‌ గా మహేష్‌ బాబు రానున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా జెమిని టీవీ ప్రకటించింది. అంతేకాదు.. ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు ”ఎవరు మీలో కోటీశ్వరులు” షో లో ఉన్న ఫోటోను అధికారికంగా ప్రకటించింది జెమినీ టీవీ. అయితే.. ఈ షో ఎప్పుడూ ప్రసారం అవుతుందో మాత్రం చెప్పలేదు. త్వరలోనే ఈ షో తేదీని ప్రకటించనుంది జెమీని టీవీ. ఇక ఈ ప్రకటనతో ఇక పూనకాలే అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com