ఎన్టీఆర్ షోలో గెస్ట్గా మహేష్ బాబు
- November 20, 2021
యంగ్ టైగన్ ఎన్టీఆర్ ”ఎవరు మీలో కోటీశ్వరులు” షో తో తెలుగు ప్రేక్షకాభిమానులను తన దైన స్టైల్ లో ఎంటర్ టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఎపిసోడ్ కు సినీ సెలబ్రీటీలు కూడా రావడం తో టీఆర్పీ రేటింగ్ ఆమాంతం పెరిగి పోయింది.
ఇది వరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి అలాగే.. టాలీవుడ్ హీరోయిన్ సమంత.. వచ్చి ఎంటర్ టైన్ చేయగా… తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అందరినీ అలరించేందుకు సిద్దం అయ్యాడు.
అవును ”ఎవరు మీలో కోటీశ్వరులు” షో కి గెస్ట్ గా మహేష్ బాబు రానున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా జెమిని టీవీ ప్రకటించింది. అంతేకాదు.. ఎన్టీఆర్, మహేష్ బాబు ”ఎవరు మీలో కోటీశ్వరులు” షో లో ఉన్న ఫోటోను అధికారికంగా ప్రకటించింది జెమినీ టీవీ. అయితే.. ఈ షో ఎప్పుడూ ప్రసారం అవుతుందో మాత్రం చెప్పలేదు. త్వరలోనే ఈ షో తేదీని ప్రకటించనుంది జెమీని టీవీ. ఇక ఈ ప్రకటనతో ఇక పూనకాలే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Evaru Meelo Koteeswarulu | Gemini TV
— Gemini TV (@GeminiTV) November 20, 2021
Get ready to watch the episode of the decade soon on Gemini TV. #PoonakaalaEpisodeLoading #EMKbyNTRonGeminiTV #EvaruMeeloKoteeswaruluOnGeminiTV #EvaruMeeloKoteeswarulu pic.twitter.com/xlrBgnwuLS
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









