పంబానదికి భారీ వరద..శబరిమలలో భక్తులకు దర్శనాలు నిలిపివేత
- November 20, 2021
పంబానదికి వరద ఉధృతి పెరిగింది. ఈ వరద ఉధృతి ప్రభావం శబరిమల ఆలయ దర్శనాలపై పడింది. వరద పెరగడంతో శబరిమల ఆలయంలోకి భక్తుల దర్శనాలను నిలిపివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరద తీవ్రత తగ్గిన తరువాతే ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక, కల్కి-ఆంథోడ్ రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండింది. ఏ క్షణంలో అయినా రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నది.
దిగువప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. గత కొన్ని రోజులుగా పంబానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో కేరళలోని నదులకు వరద చేరింది. వారం రోజుల క్రితమే శబరిమల ఆలయాన్ని తెరిచారు. ఇంతలోనే పంబానదికి వరద రావడంతో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







