ఒమన్ 51 నేషనల్ డే ఉత్సవాల్లో భాగంగా మస్కట్ గవ్నర్ విందు
- November 22, 2021
మస్కట్: ఒమన్ 51 వ నేషనల్ డే ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మస్కట్ గవర్నర్ సయ్యద్ హిలాల్ అల్ బుసైదీ మంత్రులకు, అధికారులు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. మస్కట్ లోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మస్కట్ గవర్నర్ సయ్యద్ హిలాల్ అల్ బుసైదీ మాట్లాడారు. అందరికీ 51 వ నేషనల్ డే శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఒమన్ ప్రజలు సుఖ శాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఒమన్ రాజు సుల్తాన్ హైతం బిన్ తారిక్ కలకాలం ఆరోగ్యంగా ఉండాలని...ఆయన పాలనలో దేశం మరింత అభివృద్ధి చెందాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ విందు కార్యక్రమంలో పలువురు మంత్రులు, గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) మెంబర్లు, స్టేట్ కౌన్సిల్, షురా కౌన్సిల్ సభ్యులు, సెక్రటరీలు, సీనియర్ మిలిటరీ కమాండర్లు, మస్కట్ లోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు
- భారత్లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య
- సౌదీలోని కొన్ని నగరాల్లో తగ్గిన చలి..!!
- ఖతార్ లో రమదాన్ క్యాలెండర్.. నెలంతా సందడే..!!
- ఒమానీ పౌరులకు అజర్బైజాన్ గుడ్ న్యూస్..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై పరిమితులు..!!
- బహ్రెయిన్ పౌరులకే పబ్లిక్ ఫార్మసీలు..!!
- దుబాయ్ లో పెయిడ్ పార్కింగ్ అవర్స్ రివైజ్డ్..రెండు గంటలు ఫ్రీ..!!
- సినీ నటి ప్రత్యూష మృతి కేసు..సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- భారత్ లోనే కాస్ట్లీ ఎయిర్పోర్ట్గా హైదరాబాద్..









