ఏప్రిల్ 1న విడుదలకానున్న 'పిడుగు' చిత్రం
- March 22, 2016
వినీత్, మోనికా సింగ్ హీరో హీరోయిన్లుగా వి2 ఫిల్మ్స్ ప్రై.లి. బ్యానర్పై రామమోహన్.సి.హెచ్ దర్శకత్వంలో అశోక్ గోటి నిర్మించిన చిత్రం 'పిడుగు'. ఈ చిత్రం ద్వారా నిర్మాత అశోక్ గోటి తన తనయుడు వినీత్ను హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 1న విడుదలవుతుంది. పిడుగు సినిమాకు సంబంధించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ '' సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమాతో హీరోగా పరిచయమవుతున్న హీరో వినీత్ కమర్షియల్ హీరోగా రాణిస్తాడు. ఐదు సినిమాలు, ఐదు ఫైట్స్ తో ఫస్టాఫ్ అంతా లవ్ ట్రాక్, సెకండాప్ అంతా యాక్షన పార్ట్ తో సినిమా అంతా ఎంటర్ టైనింగ్ వేలో సినిమా రన్ అవుతుంది.
సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నాం'' అన్నారు.వినీత్, మోనికా సింగ్, వినోద్కుమార్, బెనర్జీ, అనంత్, ఫణి, ముఖ్తార్ ఖాన్, ప్రియాంక, సంధ్యాజనక్, ప్రభావతి, జూ.రేలంగి నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ః వెంకటేష్.ఆర్, మాటలుః రమేష్ రాయ్, పాటలుః భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, వరికుప్పల యాదగిరి, సంగీతంః కార్తీక్, విజయ్ కురాకుల, కెమెరాః పి.ఎస్.ప్రకాష్, ఎడిటర్ః కార్తీక్ శ్రీనివాస్, నిర్మాతః అశోక్ గోటి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంః రామమోహన్.సి.హెచ్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







