వైఫైకి 100 రెట్లు వేగంతో వైఫై
- March 22, 2016
వైఫై టెక్నాలజీకి 100 రెట్లు వేగంతో పనిచేసే లైఫై నెట్వర్క్ అతి త్వరలోనే దుబాయ్లో అందుబాటులోకి రానుంది. అది కూడా వైఫైతో పోల్చితే తక్కువ ధరకే లభ్యం కానుంది. యూఏఈకి చెందిన టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ డు మరియు యూఏఈకి చెందిన ష్ట్రబ్రాండ్ జీరో1, సక్సెస్ఫుల్గా ఈ విధానాన్ని డెమోన్స్ట్రేట్ చేశామని వెల్లడించాయి. లైట్ ఫెడెలిటీ (లైఫై) టెక్నాలజీ దుబాయ్లో సంచలనాలకు సిద్ధం అవుతోందని వారు వెల్లడించారు. లైఫై అంటే వైర్లెస్ ఆప్టికల్ నెట్వర్క్ టెక్నాలజీతో పనిచేస్తుంది. లైట్ ఎమిటింగ్ డయోడ్స్ (ఎల్ఇడి) టెక్నాలజీని లైఫై ఉపయోగించుకుంటుంది. సెకెనుకి 224 జిబి డాటా ట్రాన్స్ఫర్ ఈ లైఫై టెక్నాలజీతో సాధ్యమవుతుంది. 2021 నాటికి లైఫై మార్కెట్ 80 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని డు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సలీమ్ అల్బ్లూషి చెప్పారు. జీరో1తో కలిసి డు సంస్థ లైఫై ఎనేబుల్డ్ సొల్యూషన్స్ని డెవలప్ చేస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









