చట్టాలు ఉల్లంఘించిన 17 మంది ప్రవాసులు అరెస్ట్
- November 25, 2021
ఒమన్: ఒమన్ లో ఉంటున్న చాలా మంది ప్రవాసులు ఇక్కడి లేబర్ అండ్ రెసిడెన్షియల్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ లెక్క చేయటం లేదు. ఇప్పటికే పలుమార్లు చట్టాల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే 11 మంది ఆఫ్రికన్లు అక్రమంగా దేశంలోకి చొరబడితే వారిని అరెస్ట్ చేశారు. తాజాగా రాయల్ ఒమన్ పోలీసులు మరో 17 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు. వీరంతా లేబర్ అండ్ రెసిడెన్షియల్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడినట్లు అల్ బురామి గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అరెస్టైన వారిలో ఆఫ్రికన్ దేశాల వారితో పాటు ఏషియన్స్ కూడా ఉన్నారు. ఇక మరో ఇద్దరు ఏషియన్స్ డ్రగ్స్ అమ్ముతుండగా వారిని పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి 2.5 కిలోల క్రిస్టల్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







