చట్టాలు ఉల్లంఘించిన 17 మంది ప్రవాసులు అరెస్ట్
- November 25, 2021ఒమన్: ఒమన్ లో ఉంటున్న చాలా మంది ప్రవాసులు ఇక్కడి లేబర్ అండ్ రెసిడెన్షియల్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ లెక్క చేయటం లేదు. ఇప్పటికే పలుమార్లు చట్టాల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే 11 మంది ఆఫ్రికన్లు అక్రమంగా దేశంలోకి చొరబడితే వారిని అరెస్ట్ చేశారు. తాజాగా రాయల్ ఒమన్ పోలీసులు మరో 17 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు. వీరంతా లేబర్ అండ్ రెసిడెన్షియల్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడినట్లు అల్ బురామి గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అరెస్టైన వారిలో ఆఫ్రికన్ దేశాల వారితో పాటు ఏషియన్స్ కూడా ఉన్నారు. ఇక మరో ఇద్దరు ఏషియన్స్ డ్రగ్స్ అమ్ముతుండగా వారిని పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి 2.5 కిలోల క్రిస్టల్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్