కొత్త వీసాల జారీ ప్రక్రియ ఆన్ లైన్ లో...మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి
- November 27, 2021
కువైట్:వీసాల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నట్లు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పీఏఎమ్ )తెలిపింది. వర్క్ పర్మిట్ కు సంబంధించిన వీసాలను త్వరలోనే ఆన్ లైన్ లో జారీ చేస్తామని ప్రకటించింది. వర్క్ పర్మిట్ వీసాలు తీసుకోవటానికి జనాలు ఆఫీసుల చుట్టు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సమస్యపై దృష్టి పెట్టిన (పీఏఎమ్) అధికారులు ఆన్ లైన్ లో వీసాల జారీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఇది అమల్లోకి రావచ్చని అధికారులు తెలిపారు. వర్క్ వీసాలను ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి బదిలీ చేయటం, ఫ్యామిలీ వీసా నుంచి కంపెనీ వీసా మార్చుకోవటం, స్టూడెంట్ వీసాను వర్క్ పర్మిట్ వీసా మార్చుకునేందుకు కూడా ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే చాలా మంది ప్రవాసులకు మేలు జరగనుంది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







