కొత్త వీసాల జారీ ప్రక్రియ ఆన్ లైన్ లో...మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి
- November 27, 2021కువైట్:వీసాల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నట్లు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పీఏఎమ్ )తెలిపింది. వర్క్ పర్మిట్ కు సంబంధించిన వీసాలను త్వరలోనే ఆన్ లైన్ లో జారీ చేస్తామని ప్రకటించింది. వర్క్ పర్మిట్ వీసాలు తీసుకోవటానికి జనాలు ఆఫీసుల చుట్టు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సమస్యపై దృష్టి పెట్టిన (పీఏఎమ్) అధికారులు ఆన్ లైన్ లో వీసాల జారీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఇది అమల్లోకి రావచ్చని అధికారులు తెలిపారు. వర్క్ వీసాలను ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి బదిలీ చేయటం, ఫ్యామిలీ వీసా నుంచి కంపెనీ వీసా మార్చుకోవటం, స్టూడెంట్ వీసాను వర్క్ పర్మిట్ వీసా మార్చుకునేందుకు కూడా ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే చాలా మంది ప్రవాసులకు మేలు జరగనుంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?