కొత్త వీసాల జారీ ప్రక్రియ ఆన్ లైన్ లో...మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి
- November 27, 2021
కువైట్:వీసాల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నట్లు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పీఏఎమ్ )తెలిపింది. వర్క్ పర్మిట్ కు సంబంధించిన వీసాలను త్వరలోనే ఆన్ లైన్ లో జారీ చేస్తామని ప్రకటించింది. వర్క్ పర్మిట్ వీసాలు తీసుకోవటానికి జనాలు ఆఫీసుల చుట్టు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సమస్యపై దృష్టి పెట్టిన (పీఏఎమ్) అధికారులు ఆన్ లైన్ లో వీసాల జారీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఇది అమల్లోకి రావచ్చని అధికారులు తెలిపారు. వర్క్ వీసాలను ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి బదిలీ చేయటం, ఫ్యామిలీ వీసా నుంచి కంపెనీ వీసా మార్చుకోవటం, స్టూడెంట్ వీసాను వర్క్ పర్మిట్ వీసా మార్చుకునేందుకు కూడా ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే చాలా మంది ప్రవాసులకు మేలు జరగనుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









