మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... ప్రపంచ వ్యాప్తంగా 259.61 మిలియన్ల మందికి వైరస్
- November 27, 2021
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్ ఎఫెక్ట్ తగ్గిందని అంతా భావిస్తున్నప్పటికీ చాపకింద నీరులా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. తాజాగా సౌత్ ఆఫ్రికాలో పుట్టిన కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగానూ మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం వరకు కేసులు తక్కువగా నమోదైనప్పటికీ...మళ్లీ వాటి సంఖ్య వేగంగా పెరగుతుండటం ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 259.61 మిలియన్లకు చేరింది.ఇది అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా ఇంత కన్నా ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. ఇక మహమ్మరి కారణంగా 54,36, 733 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019 డిసెంబర్ లో చైనా లో తొలి కరోనా కేసు నమోదైంది. ఆరు నెలల కాలంలోనే ఇది ప్రపంచ దేశాలను చుట్టుముట్టింది. మొత్తం 210 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఐతే ఇప్పటికీ కరోనా ప్రమాదం పొంచి ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. ప్రజలంతా మాస్క్ ధరించి, శానిటైజేషన్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తోంది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







