మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... ప్రపంచ వ్యాప్తంగా 259.61 మిలియన్ల మందికి వైరస్
- November 27, 2021
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్ ఎఫెక్ట్ తగ్గిందని అంతా భావిస్తున్నప్పటికీ చాపకింద నీరులా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. తాజాగా సౌత్ ఆఫ్రికాలో పుట్టిన కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగానూ మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం వరకు కేసులు తక్కువగా నమోదైనప్పటికీ...మళ్లీ వాటి సంఖ్య వేగంగా పెరగుతుండటం ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 259.61 మిలియన్లకు చేరింది.ఇది అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా ఇంత కన్నా ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. ఇక మహమ్మరి కారణంగా 54,36, 733 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019 డిసెంబర్ లో చైనా లో తొలి కరోనా కేసు నమోదైంది. ఆరు నెలల కాలంలోనే ఇది ప్రపంచ దేశాలను చుట్టుముట్టింది. మొత్తం 210 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఐతే ఇప్పటికీ కరోనా ప్రమాదం పొంచి ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. ప్రజలంతా మాస్క్ ధరించి, శానిటైజేషన్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేందుకు కొత్త హైవే
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!









