ఫోన్ చేస్తారు.. డబ్బు కాజేస్తారు
- December 02, 2021
హైదరాబాద్: ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో నకిలీ ఎస్బీఐ బ్యాంకు కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారని... ఇది దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసమని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. ఏడాదిలోనే దేశ వ్యాప్తంగా అమాయకులకు 33వేలు కాల్స్ చేసి.. కోట్ల రూపాయలు కాజేశారన్నారు. ఈ ముఠాపై దేశ వ్యాప్తంగా 209 కేసులున్నాయన్నారు. ఎస్బీఐ ఎజెంట్లు నుంచి ఖాతాదారుల వివరాలు తీసుకున్న ఫర్మన్ హుసేన్ ప్రధాన నిందితడు... స్పూఫింగ్ అప్లికేషన్ తయారు చేసి నకిలీ కార్డులు తయారు చేస్తున్నారని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ను విదేశాల్లో కూడా నిందితులు వాడుతున్నారన్నారు. +18601801290 అనే నంబరు నుంచి ఫోన్ చేస్తారని.. బాధితుల నుంచి కార్డుల వివరాలు సేకరించి డబ్బు కాజేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో మొత్తం 14మందిని అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి 30 సెల్ఫోన్లు, 3 లాప్టాప్లు, ఒక కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







