ఒమిక్రాన్: ట్రావెల్ టిక్కెట్లను రద్దు చేసుకున్న 20 శాతం మంది ప్రయాణీకులు

- December 03, 2021 , by Maagulf
ఒమిక్రాన్: ట్రావెల్ టిక్కెట్లను రద్దు చేసుకున్న 20 శాతం మంది ప్రయాణీకులు

కువైట్: కువైట్ నుంచి సుమారు 20 శాతం మంది ప్రయాణీకులు ట్రావెల్ టిక్కెట్లను ఒమైక్రాన్ భయం కారణంగా రద్దు చేసుకున్నారు. కోవిడ్ 19 కొత్త మ్యుటెంట్ ఒమిక్రాన్ భయాలు ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఇప్పటికే బుక్ చేసుకున్న చాలా టిక్కెట్లు రద్దయ్యాయి. కాగా, జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 115 శాతం మేర ప్రయాణాల సంఖ్య పెరిగినట్లు టూరిజం మరియు ట్రావెల్ కార్యాయాలు వెల్లడిస్తున్నాయి. 2020 సంవత్సరంతో పోల్చితే ఈ పెరుగుదల నమోదయ్యింది. 2020లో చాలావరకు విమానాశ్రయాలు మూతపడ్డాయి. అంతకు ముందు ఏడాది.. అంటే, 2019లో 308 మిలియన్ దిర్హాములు (టిక్కెట్ అమ్మకాలు) జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com