IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా భారతీయ-అమెరికన్ గీతా గోపీనాథ్..
- December 03, 2021
అమెరికా: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో ఆర్థికవేత్త, భారతీయ-అమెరికన్ గీతా గోపీనాథ్.. మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పదోన్నతి పొందింది. త్వరలో ఆమె ఈ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారని ఐఎంఎఫ్ ప్రకటించింది. ఆ తర్వాత గీతా గోపినాథ్ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐఎంఫ్లో గీతా గోపినాథ్ చీఫ్ ఎకానమిస్ట్గా పని చేసేవారు. వచ్చే ఏడాది జాఫ్రీ ఒకామోటో.. ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ బాధ్యతల నుండి వైదొలగనున్నారు. వాస్తవానికి జనవరి 2022లో గీతా గోపినాథ్ పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తిరిగి పాఠాలు చెబుకుంటారని అంతా భావించారు. ఐఎంఎఫ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జీవ సూచన మేరకు గీతా గోపినాథ్.. డిప్యూటీ ఎండీ బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు.
"జాఫ్రీ, గీత గోపినాథ్లు ఇద్దరూ అద్భుతమైన సహోద్యోగులు - జాఫ్రీ వెళ్ళడం నాకు చాలా బాధగా ఉంది. అయితే అదే సమయంలో గీత గోపినాథ్ ఎఫ్డీఎండీ అనే కొత్త బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను" అని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా అన్నారు. జార్జివా మాట్లాడుతూ.. ఐఎంఎఫ్కు గీతా గోపీనాథ్ అందించిన సహకారం ఇప్పటికే అసాధారణమైనదని అన్నారు. ఆమె మేధో నాయకత్వం మన జీవితంలోని అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభం నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఐఎంఎఫ్కు ఎంతో సాయం చేసిందన్నారు. ఐఎంఎఫ్ చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనామిస్ట్ అయిన శ్రీమతి గోపీనాథ్ - సభ్య దేశాలు, సంస్థ అంతటా గౌరవం, ప్రశంసలను పొందారని అన్నారు.
తాజా వార్తలు
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!







