హెలికాప్టర్ ప్రమాదంపై లోక్సభలో రాజ్నాథ్
- December 09, 2021న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాద ఘటనలో మరణించిన వారికి లోక్సభ సంతాపం తెలిపింది. సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం హెలికాప్టర్ దుర్ఘటనపై రక్షణశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు.
ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించామన్నారు. బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు వెల్లింగ్టన్లో హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి ఉందని.. అయితే మధ్యాహ్నం 12.08 గంటలకు సుల్లూరు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయన్నారు.
ఈ ప్రమాదంతో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్తో పాటు ఆయన సతీమణి మృతి చెందారని రాజ్నాథ్ వెల్లడించారు. హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారని, భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి స్థానికులు చేరుకున్నారన్నారు. గురువారం సాయంత్రానికి మృతదేహాలు ఢిల్లీకి చేరుతాయన్నారు. శుక్రవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ జరుగుతోందని, ఎయిర్మార్షల్ నేతృత్వంలో విచారణ కమిటీ నియమించినట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్