జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- May 11, 2024
టోక్యో: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ మే 20 నుండి 23 వరకు జపాన్లో అధికారిక పర్యటన చేయనున్నట్లు టోక్యో శుక్రవారం ప్రకటించింది. " క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి హోదాలో అతని మొదటి జపాన్ పర్యటన. 2019 లో G20 ఒసాకా సమ్మిట్కు గతంలో హాజరయ్యారు. " అని జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సందర్శన సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ జపాన్ చక్రవర్తితో భేటీ అవుతారు. దీనితోపాటు జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా, క్రౌన్ ప్రిన్స్తో శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తారు. రాబోయే పర్యటన జపాన్- సౌదీ అరేబియా రాజ్యం మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని, సంవత్సరాలుగా ఏర్పడిన బలమైన సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోతోందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









