హెలికాప్టర్ ప్రమాదంపై లోక్సభలో రాజ్నాథ్
- December 09, 2021
న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాద ఘటనలో మరణించిన వారికి లోక్సభ సంతాపం తెలిపింది. సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం హెలికాప్టర్ దుర్ఘటనపై రక్షణశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు.
ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించామన్నారు. బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు వెల్లింగ్టన్లో హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి ఉందని.. అయితే మధ్యాహ్నం 12.08 గంటలకు సుల్లూరు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయన్నారు.
ఈ ప్రమాదంతో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్తో పాటు ఆయన సతీమణి మృతి చెందారని రాజ్నాథ్ వెల్లడించారు. హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారని, భారీ శబ్దం రావడంతో ఘటనా స్థలానికి స్థానికులు చేరుకున్నారన్నారు. గురువారం సాయంత్రానికి మృతదేహాలు ఢిల్లీకి చేరుతాయన్నారు. శుక్రవారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ జరుగుతోందని, ఎయిర్మార్షల్ నేతృత్వంలో విచారణ కమిటీ నియమించినట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- జూన్ 30న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- సెయింట్ లూయిస్లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం
- 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- జీసీసీ జాతీయులకు వీసా విషయమై వెసులుబాటు కల్పించనున్న యూకే
- తెలంగాణ కరోనా అప్డేట్
- జూలైన్ 9న ఈద్ అల్ అదా
- వంశీ-శుభోదయం పురస్కారాలు..
- ఆన్లైన్ మోసం: గుట్టు రట్టు చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాలపై కువైట్ కీలక నిర్ణయం..!
- అంబానీ సంచలన నిర్ణయం